renuka choudary: కేసీఆర్, కోమటిరెడ్డిలను పరామర్శించిన రేణుకా చౌదరి

  • కేసీఆర్, కోమటిరెడ్డి త్వరగా కోలుకోవాలన్న రేణుకా చౌదరి
  • కేసీఆర్ సాధారణ జీవితాన్ని ప్రారంభించి ప్రజల మధ్యకు వస్తారని ఆకాంక్ష
  • కోమటిరెడ్డి రేపు అసెంబ్లీకి రావాలనే తపనతో ఉన్నట్లు చెప్పిన రేణుకా చౌదరి
renuka chowdhury meets KCR and Komatireddy

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో సాధారణ జీవితం ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలో సాధారణ జీవితాన్ని ప్రారంభించి ప్రజల మధ్యకు వస్తారన్నారు. 

మొదటి అంతస్తులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చికిత్స పొందుతున్నారన్నారు. రేపు అసెంబ్లీకి రావాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. 9వ ఫ్లోర్‌లో కేసీఆర్‌ను కలిశానన్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

More Telugu News