Saindhav: విద్యార్థులతో గల్లీ క్రికెట్ ఆడిన వెంకీ మామ

  • గుంటూరులో సైంధవ్ మూవీ ప్రమోషన్
  • వీవీఐటీ, కేఎల్ యూ యూనివర్సిటీ మధ్య క్రికెట్ మ్యాచ్
  • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సైంధవ్ టీమ్
Victory Venkatesh played Galli Cricket with VVIYT Students

విక్టరీ వెంకటేశ్ కొత్త చిత్రం సైంధవ్ విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేశ్ ఆంధ్రాలో పర్యటించారు. విజయవాడ, గుంటూరులో సందడి చేశారు. బెజవాడ కనకదుర్గమ్మను ఈ సినిమా బృందం దర్శించుకుంది. అనంతరం బాబాయ్ హోటల్ లో వెంకటేశ్ సందడి చేసిన విషయం తెలిసిందే.

వెంకటేశ్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, సైంధవ్ టీమ్ వివిధ సిటీలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ లతో పాటు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయవాడ నుంచి గుంటూరు చేరుకున్న సైంధవ్ టీమ్.. వీవీఐటీ కాలేజ్ లో ఓ పాటను రిలీజ్ చేశారు.

గుంటూరులో కాలేజీ విద్యార్థులతో కలిసి వెంకటేశ్ సందడి చేశారు. వీవీఐటీ, కేఎల్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ క్రమంలో వెంకటేశ్ కాసేపు బ్యాటింగ్ చేసి విద్యార్థులను అలరించారు. వీవీఐటీ విద్యార్థులతో వెంకటేశ్, శైలేశ్ కొలను టీమ్ తలపడింది. ఈ గల్లీ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'వెంకీ మామా బ్యాటింగ్ అదుర్స్' అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News