Abhay Bethiganti: 'ఆహా' తెరపైకి 'రాక్షస కావ్యం'

  • అక్టోబర్ 13న విడుదలైన 'రాక్షస కావ్యం'
  • నూతన నటీనటులతో తీసిన సినిమా
  • ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ 
  • Imdb నుంచి మంచి రేటింగ్

Rakshasa Rajyam OTT Release Date Confirmed

రీసెంటుగా 'ఆహా'లో వచ్చిన ' మా ఊరి పొలిమేర 2' సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల థియేటర్స్ నుంచి మంచి వసూళ్లను రాబట్టిన ఆ సినిమా, ఓటీటీ వైపు నుంచి కూడా విశేషమైన ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి 'రాక్షస కావ్యం' రెడీ అవుతోంది. అక్టోబర్ 13వ తేదీనే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం వలన, ఆ విషయం తెలిసినవాళ్లు చాలా తక్కువ.

ఇప్పుడు ఈ సినిమాను 'ఆహా' తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు కూడా. దాదాపుగా నూతన నటీనటులతో రూపొందించిన సినిమా ఇది. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, రాజీవ్ రాజ్ - శ్రీకాంత్ నిర్మాతలుగా ఉన్నారు.   

అజయ్ - విజయ్ అనే రెండు ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మంచి మనుషులను ఎలా మారుస్తాయి? అలా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి? అనే ఒక అంశం నేపథ్యంలో కథ నడుస్తుంది. Imdb నుంచి మంచి రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.

More Telugu News