రైతులకు పెట్టుబడి సాయం... నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- కేసీఆర్ హయాంలో ప్రారంభమైన రైతుబంధు
- విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో గతంలోని విధానాల ప్రకారమే పెట్టుబడి సాయం
- ఎన్నికలకు ముందు రూ.15000 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ సాయం కింద ప్రతి ఆరు నెలలకు ఎకరానికి రూ.5000 అందిస్తారు. ఏడాదిలో రెండు పర్యాయాలు... మొత్తం రూ.10,000 అందిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలోనూ పెట్టారు. అయితే ఇంకా విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఈసారికి గత విధివిధానాల ప్రకారం ఇవ్వనున్నారు.