ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
- బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి ఎస్ఐ హైమావతిపై ఇద్దరు వ్యక్తులు దాడి
- దాడి ఘటనలో ఎస్ఐ కాలికి గాయం.. పగిలిపోయిన ఫోన్
- నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ ఎస్పీ ఆదేశాలు
- ఇసుక అక్రమ రవాణాదారులే దాడి చేసి ఉండొచ్చని సందేహాలు
ఈ ఘటనలో ఎస్ఐ కాలికి గాయమైంది. ఆమె సెల్ఫోన్ పగిలిపోయింది. ఈ దాడి ఘటన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు తెలియడంతో ఆయన స్పందించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు. ఈ దాడి ఘటనపై ఎస్ఐ హైమావతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎస్ఐపై దాడి చేసిన వ్యక్తులు ఇసుక అక్రమ రవాణాదారులే కావొచ్చునని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.