Gurugoan: ఇంట్లో పనికి పెట్టుకున్న టీనేజ్ బాలికపై యజమానుల దారుణాలు!

  • రెండు రోజులకు ఓసారి ఆహారం
  • బాలికను ఇనుప రాడ్డుతో కొట్టిన ఇంటి ఓనర్ భార్య
  • చిన్నారి దుస్తులు విప్పి చిత్రీకరించిన ఇంటి యజమాని కుమారులు
  • నిందితులపై కేసు పెట్టిన బాలిక తల్లి
Teen Help Stripped Beaten Bitten By Dogs Locked Up At Gurugram Home

పనికి కుదుర్చుకున్న టీనేజ్ బాలికపై ఇంటి యజమానులు చిత్రహింసలకు దిగిన ఘటన తాజాగా గురుగావ్‌లో వెలుగులోకి వచ్చింది. బాలికను కొట్టి, కుక్కలతో కరిపించి, దుస్తులు తొలగించి అసభ్యంగా తాకారంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన ఓ మహిళ తనకు తెలిసిన వారి ద్వారా తన కూతురిని (13) గురుగావ్‌లోని సెక్టర్ 57లో ఉండే శశి శర్మ ఇంట్లో పనికి పెట్టింది. నెలకు రూ.9000 జీతానికి ఒప్పందం కుదుర్చుకుంది. 

తొలి రెండు నెలలు అంతా సాఫీగా సాగినా తరువాత యజమానులతో ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పింది. కూతురిని చూసేందుకు వెళ్లినా వాళ్లు కలవనిచ్చే వారు కాదని పేర్కొంది. ఇటీవల ఓ రోజు కూతురిని చూసేందుకు శశి ఇంటికి వెళ్లగా ఆ చిన్నారి ఓ గదిలో బందీగా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నోటికి టేపు వేశారని, రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవారని ఆరోపించింది. 

శశి భార్య తన కూతురిని ఇనుప రాడ్డుతో కొట్టేదని, వాళ్ల కొడుకులు తన కూతురి దుస్తులు తొలగించి కెమెరాతో చిత్రీకరించేవారని, అసభ్యకరంగా తాకేవారని చెప్పి వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టంతో పాటూ ఐపీసీకి చెందిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News