Revanth Reddy: తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య

  • తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు దీరిందన్న రేవంత్ రెడ్డి 
  • బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని వ్యాఖ్య
  • ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందని, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్న రేవంత్
Chief Minister Revanth Reddy tweet on government

కాంగ్రెస్ గెలుపు తర్వాత... తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు దీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. 
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. 
ఇది మీ అన్న ఇస్తున్న మాట.' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News