Ram Gopal Varma: తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై రామ్‌గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు !

  • బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన జనసేన  
  • పోటీ చేసిన 8 స్థానాల్లోనూ ఓడిపోయిన జనసేన
  • గణితశాస్ర్తంలో ఆర్యభట్ట సున్నా ఆవిష్కరిస్తే.. పవన్ రాజకీయాల్లో సున్నా కనిపెట్టాడంటూ వర్మ సెటైర్  
Ram Gopal Varma satires on Janasenas defeat in Telangana elections

జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘ ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు’’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు.

More Telugu News