Sai Pallavi: యశ్ సరసన నాయికగా సాయిపల్లవి?

  • ఇటీవల తెలుగు తెరపై కనిపించని సాయిపల్లవి 
  • రీసెంటుగా ఒప్పుకున్న ప్రాజెక్టు 'తండేల్'
  • యశ్ సినిమా చేయనుందని టాక్ 
  • త్వరలో రానున్న స్పష్టత  
Sai pallavi in Yash movie

సాయిపల్లవికి ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. తెలుగు నుంచి ఆమెకి నచ్చిన కథ వెళ్లకపోవడమే అందుకు కారణమని చెప్పాలి. అందువల్లనే ఆమె ఇతర భాషల్లో తనకి నచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. 'తండేల్' కథ నచ్చడంతో ఇటీవలే ఆమె ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.  చైతూ - చందూ మొండేటి కాంబినేషన్లో ఆమె ఈ సినిమా చేస్తోంది. 

ఇక ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ సరసన ఆమె చేయనున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యశ్ 19వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుక్రవారం రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.  గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. 

ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి కనిపించనుందని అంటున్నారు. ఆమె ఎంపిక జరిగిపోయిందనే ప్రచారం జోరుగానే ఉంది. అయితే అధికారిక ప్రకటన రావలసి ఉంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉండాలి .. గుర్తింపు ఉండాలని బలంగా భావించే సాయిపల్లవి, ఈ సినిమా చేయడమనేది ఎంతవరకూ వాస్తవమనేది చూడాలి. 

More Telugu News