VVS Lakshman: బ్యాటింగ్ పిచ్ లపై వాళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు: వీవీఎస్ లక్ష్మణ్

  • ఆసీస్ తో ముగిసిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • 4-1తో సిరీస్ గెలిచిన టీమిండియా
  • యువ జట్టు అమోఘంగా ఆడిందంటూ లక్ష్మణ్ కితాబు
  • రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ లను ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం
VVS Lakshan appreciates Ravi Bishnoi and Axar Patel

వరల్డ్ కప్ ముగిశాక ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో టీమిండియా ఈ సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది. టీమిండియా ప్రదర్శనపై లక్ష్మణ్ స్పందించాడు. టీమిండియా యువ జట్టు ఈ సిరీస్ లో అమోఘమైన ఆటతీరు కనబర్చిందని కొనియాడాడు. 

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం ఎంతోగానో ఆకట్టుకుందని, కుర్రాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుని రాణించడం ఎంతో సంతోషం కలిగించిందని పేర్కొన్నాడు. 

రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాలని, బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ లపై వాళ్లిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని అభినందించాడు. పది రోజుల పాటు జరిగిన ఈ సిరీస్ ను చిరస్మరణీయం చేసిన యావత్ టీమిండియాకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని లక్ష్మణ్ పేర్కొన్నారు.

More Telugu News