తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా
- అంజనీ కుమార్పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడంతో కొత్త డీజీపీ ప్రకటన
- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్గా ఉన్న రవి గుప్తా
ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్తున్న సమయంలో డీజీపీ అంజనీ కుమార్ వెళ్లి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం వివాదాస్పదంగా మారింది. పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలపడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ను అతిక్రమించడంతో అంజనీ కుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది. డీజీపీ అంజనీకుమార్తోపాటు ఆయన వెంట ఉన్న అదనపు డీజీలు సందీప్కుమార్ జైన్, మహేశ్భగవత్లను ఎన్నికల సంఘం వివరణ కోరింది.