Narendra Modi: తెలంగాణతో మా బంధం విడదీయరానిది: ప్రధాని మోదీ

  • ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ ట్వీట్
  • బీజేపీకి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్న ప్రధాని
  • రాబోయే కాలంలో ఈ మద్దతు కొనసాగుతుందని ఆకాంక్ష
PM thanks to telangana people

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా, మీరు బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా మీ మద్దతు పెరుగుతూనే ఉంది... ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతోంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను.' అని ట్వీట్ చేశారు.

More Telugu News