నిత్యానంద స్వామి దెబ్బకు పదవి కోల్పోయిన పరాగ్వే దేశ మంత్రి
- ఒక ద్వీపంలో కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద
- పరాగ్వే మంత్రిని నమ్మించి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న కైలాస ప్రతినిధులు
- గుర్తింపు లేని దేశంతో ఒప్పందం చేసుకున్నందుకు పదవి కోల్పోయిన మంత్రి
ఈ సందర్భంగా అర్నాల్డో మీడియాతో మాట్లాడుతూ... తమ దేశం దక్షిణ అమెరికాకు చెందిన ఒక ద్వీపం అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు తనకు చెప్పారని తెలిపారు. పర్వాగ్వేకు మేలు చేయాలనే భావనతో వచ్చామని చెప్పారని... పలు ప్రాజెక్టుల గురించి వివరించారని చెప్పారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఒప్పందంపై అర్నాల్డో సంతకాలు చేశారు. దీంతో, ఆయనపై వేటు పడింది. గుర్తింపు లేని దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కుదుర్చుకున్నారని వేటు వేశారు.