Nara Lokesh: కల్మషం లేని మనుషులు స్వచ్ఛమైన కల్లు అందించారు... సంతోషంగా స్వీకరించాను: నారా లోకేశ్

  • ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • కల్లు గీత కార్మికులను కలిసిన టీడీపీ యువనేత
  • కల్లు సేవించిన వైనం
Nara Lokesh tastes toddy in Mummidivaram constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ 213వ రోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేశ్ వివిధ వర్గాలను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.

కల్లు గీత కార్మికులను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకున్న లోకేశ్... వారు ఆప్యాయంగా అందించిన కల్లు సేవించారు. దీనికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. 

కల్లు గీత కార్మికులు చూపించిన ప్రేమ మాటల్లో వర్ణించలేనని తెలిపారు. కల్మషం ఎరుగని మనుషులు అభిమానంతో అందించిన స్వచ్ఛమైన కల్లు స్వీకరించానని లోకేశ్ వెల్లడించారు. కల్లు గీత కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News