Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • పిటిషన్ ను విచారించిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం
  • తదుపరి విచారణ డిసెంబర్ 12వ తేదీకి వాయిదా
  • అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
Supreme Court adjourns Chandrababu bail plea hearing in Fibernet case

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పిటిషన్ ను విచారిస్తామని... అంతవరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

మరోవైపు ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 9, గత నెల 13, 17, 20వ తేదీల్లో జరిగింది. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత ఈ పిటిషన్ ను పరిశీలిస్తామని ధర్మాసనం ఇంతకు ముందే తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకపోవడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది.

More Telugu News