Virat Kohli: సౌతాఫ్రికాతో టీ20లు, వన్డేలకు కోహ్లీ దూరం.. రోహిత్ విషయంలో ఇంకా రాని క్లారిటీ!

  • డిసెంబర్ 10 నుంచి ఇండియా - సౌతాఫ్రికా సిరీస్
  • ప్రస్తుతం యూకేలో హాలిడే ట్రిప్ లో ఉన్న కోహ్లీ, రోహిత్
  • టీ20, వన్డేలకు దూరమయ్యే అవకాశం
Virat Kohli to stay away from T20 ODIs with South Africa and no clarity about Rohit Sharma

వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తర్వాత టీమిండియా సరికొత్తగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. మరోవైపు డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాతో ఇండియా తలపడబోతోంది. అయితే, ప్రొటీస్ తో జరిగే ఈ సిరీస్ లో టీ20లు, వన్డేలకు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దూరమవుతున్నాడని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ కు మాత్రమే కోహ్లీ అందుబాటులోకి వస్తారని ఎన్డీటీవీ ఓ కథనంలో తెలిపింది. టీ20లకు కోహ్లీ దూరం కావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని, వన్డేలకు దూరం కావడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడతాడా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, టెస్ట్ సిరీస్ లో రోహిత్ ఆడతాడని భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ యూకేలో హాలిడే ట్రిప్ లో ఉన్నట్టు సమాచారం.

More Telugu News