Team India: ఛేదనలో ఆసీస్ విఫలం... రెండో టీ20లోనూ టీమిండియానే విన్నర్

  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20
  • 44 పరుగులతో విజయం సాధించిన టీమిండియా
  • చెరో 3 వికెట్లతో రాణించిన రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ
  • సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా
Team India beat Australia by 44 runs in 2nd T20

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా రెండో టీ20 మ్యాచ్ లోనూ సత్తా చాటింది. ఆస్ట్రేలియాను 44 పరుగుల తేడాతో ఓడించింది. తిరువనంతపురంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. 

టీమిండియా బౌలర్లు రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లతో ఆసీస్ ను దెబ్బతీశారు. అర్షదీప్ సింగ్ 1, అక్షర్ పటేల్ 1, ముఖేశ్ కుమార్ 1 వికెట్ తీశారు. ఆసీస్ జట్టులో మార్కస్ స్టొయినిస్ చేసిన 45 పరుగులే అత్యధికం. టిమ్ డేవిడ్ 37, స్టీవ్ స్మిత్ 19, మాథ్యూ షార్ట్ 19 పరుగులు చేశారు. 

తొలి టీ20లో సెంచరీ చేసిన జోష్ ఇంగ్లిస్ నేటి మ్యాచ్ లో 2 పరుగులకే అవుటయ్యాడు. ఆఖర్లో ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42 నాటౌట్) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 28న గువాహటిలో జరగనుంది.

More Telugu News