Aditya L 1: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్-1 ప్రయాణం: ఇస్రో

  • ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్
  • సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
  • సూర్యుడిపై అధ్యయనం చేయనున్న ఆదిత్య
Aditya L 1 reached final stage says ISRO

చంద్రయాన్ - 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 

సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.

More Telugu News