Nara Lokesh: 'నా అన్వేషణ' యూట్యూబ్ చానల్ ను తప్పకుండా ప్రశంసించాలి: నారా లోకేశ్

  • యూట్యూబ్ లో ఎంతో పాప్యులారిటీ పొందిన 'నా అన్వేషణ' చానల్
  • ఇటీవల ఏపీ రాజకీయ పరిస్థితులపై ఓ వీడియో పోస్టు చేసిన నా అన్వేషణ
  • సదరు చానల్ కు లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో కథనం
  • వైసీపీ ఎప్పుడో దిగజారిపోయిందన్న లోకేశ్
Nara Lokesh opines on Naa Anveshana Youtube channel

యూట్యూబ్ వీడియోలు చూసేవారికి 'నా అన్వేషణ' చానల్ గురించి తెలిసే ఉంటుంది. ఓ యువకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, తనకు తోచినట్టుగా మాట్లాడుతూ, కొన్నిసార్లు ఘాటైన పదాలు ఉపయోగిస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. 'నా అన్వేషణ' యూట్యూబ్ చానల్ కు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 

అయితే, ఈ యూట్యూబ్ చానల్లో ఇటీవల రాజకీయపరమైన అంశాలతో కూడిన వీడియో ఒకటి దర్శనమిచ్చింది. అందులో జింబాబ్వే దేశంలోని అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చడం కనిపిస్తుంది. అయితే, 'నా అన్వేషణ' చానల్ కు నారా లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. నారా లోకేశ్ డబ్బిచ్చి అతడితో ఆ విధంగా చెప్పించాడన్నది ఆ పత్రికా కథనం సారాంశం. 

దీనిపై నారా లోకేశ్ స్పందించారు. "వైసీపీ ఎప్పుడో దిగజారిపోయింది. ఇంతకంటే ఇక దిగజారడానికి ఏమీ లేదు. జగన్ విధ్వంసక పాలనను ప్రశ్నించినవారిని అప్రదిష్ఠ పాల్జేసేలా వైసీపీ 5 రూపాయల పేటీఎం బ్యాచ్ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా స్పందించి, అభిప్రాయాలను వెల్లడించిన 'నా అన్వేషణ'ను తప్పకుండా ప్రశంసించాలి" అని పేర్కొన్నారు.

More Telugu News