Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల ప్రభావం
  • 5 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 9 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయి 66,017కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 19,802 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.16%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.05%), భారతి ఎయిర్ టెల్ (0.96%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.62%), విప్రో (0.49%). 

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-1.75%), ఎల్ అండ్ టీ (-1.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.71%), టీసీఎస్ (-0.51%), ఇన్ఫోసిస్ (-0.55%).

More Telugu News