Telangana Assembly Election: పోలీసుల తనిఖీలు... గచ్చిబౌలిలో కారులో పట్టుడిన రూ.5 కోట్లు

  • ఎన్నికల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు
  • బొటానికల్ పార్క్ నుంచి చిరాగ్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న కారులో తనిఖీలు
  • పట్టుబడిన రూ.5 కోట్లు ఓ వ్యాపారవేత్తదిగా గుర్తించిన పోలీసులు
Police seized rs 5 crores near gachibowli police station

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో గచ్చిబౌలి ప్రాంతంలో రూ.5 కోట్లు పట్టుబడ్డాయి. ఈ నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బొటానికల్ గార్డెన్ నుంచి చిరాగ్ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో రూ.5 కోట్లను గుర్తించారు. ఈ నగదును ఓ వ్యాపారవేత్తదిగా గుర్తించారు. పట్టుబడిన నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.

  • Loading...

More Telugu News