Team India: విశాఖలో ఈరోజు ఇండియా - ఆస్ట్రేలియా టీ20.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆటగాళ్లు

  • 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం
  • టీమిండియాకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
  • కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ కు తాత్కాలిక బాధ్యతలు
Team India players in Simhadri Appanna temple

ఆస్ట్రేలియా - టీమిండియాల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం విశాఖలో జరగనుంది. మరోవైపు సింహాచలం అప్పన్నను టీమిండియా ఆటగాళ్లు నేడు దర్శించుకున్నారు. అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆటగాళ్లకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. దర్శనానంతరం క్రికెటర్లకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సిరీస్ కు గాను సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్ గా... ఆస్ట్రేలియా కెప్టెన్ గా మాథ్యూ వేడ్ వ్యవహరిస్తున్నారు. మొన్న ముగిసిన ప్రపంచ కప్ లో ఉన్న వాళ్లలో కేవలం సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్ లో ఆడుతున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా ఆ బాధ్యతను నిర్వహిస్తున్నాడు.

More Telugu News