Joju George: ఓటీటీ సెంటర్ కి మరో మలయాళ థ్రిల్లర్ .. 'పులిమడ'

  • జోజు జార్జ్ హీరోగా రూపొందిన 'పులిమడ'
  • ఆయన సరసన నటించిన ఐశ్వర్య రాజేశ్ 
  • క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
  • ఈ నెల 23 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Pulimada movie OTT streaming date confirmed

మలయాళం నుంచి ఇప్పుడు ఓటీటీ సెంటర్ కి మరో థ్రిల్లర్ సినిమా రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'పులిమడ'. రాజేశ్ దామోదరన్ నిర్మించిన ఈ సినిమాకి, సజన్ దర్శకత్వం వహించాడు. ఇషాన్ దేవ్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. 

ఈ సినిమాలో జోజు జార్జ్ కథానాయకుడిగా నటించగా, అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపిస్తుంది. అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఐదు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ను జరుపుకోనుంది. 

ఈ సినిమాలో హీరో మానసిక స్థితి సరిగ్గా లేని తన తల్లి ఆలనా పాలన చూస్తుంటాడు. కొన్ని కారణాల వలన  అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. ఊహించని ఆ సంఘటన హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అప్పుడు అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News