మళ్లీ ప్రారంభం కానున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..!
- చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం యాత్ర
- సెప్టెంబర్ 9న రాజోలు మండలంలో నిలిచిన యాత్ర
- ఈ నెల 24న యాత్ర పునఃప్రారంభం
లోకేశ్ యాత్ర డిసెంబర్ చివరి వారం వరకు కొనసాగనుంది. యాత్ర పూర్తి అయ్యే సమయానికి ఆయన 3,550 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంది. యువగళం పాదయాత్ర రాజోలు నుంచి పి. గన్నవరం, అమలాపురం, కొత్తపేట, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖ దిశగా సాగుతుంది.