: కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలది: మంత్రి గంటా

కాంగ్రెస్ పార్టీ ఎవరినీ టార్గెట్ చేయదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరంలోని వైఎస్సార్ పార్కులో ఉడా నిర్మించిన వాకింగ్ పార్క్ ను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన, దళిత వర్గాలకు చెందినదని ఆయన స్పష్టం చేసారు. మంత్రి వర్గంలో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయని, అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత మంత్రి వర్గపునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలిపారు.

More Telugu News