World Cup: ఒక కప్పు... ఇద్దరు కెప్టెన్లు... చారిత్రక ప్రదేశంలో ఫొటోషూట్

  • వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధం
  • రేపు అహ్మదాబాద్ లో టీమిండియా × ఆస్ట్రేలియా
  • అదాలజ్ మెట్ల బావి వద్ద కప్పుతో ఫొటోలకు పోజులిచ్చిన రోహిత్, కమిన్స్
Rohit Sharma and Pat Cummins photo shoot with world cup trophy

వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు రేపు (నవంబరు 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కప్ కోసం కత్తులు దూయనున్నాయి! ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ లకు ఫొటో షూట్ నిర్వహించారు. అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఈ ఫొటో షూట్ జరిపారు. దిగ్గజ క్రికెటర్ల రాకతో వారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. దాంతో అక్కడ కోలాహలం నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకున్నాయి.

More Telugu News