Indian Railways: రైల్లో అగ్నిప్రమాదం.. ప్రయాణికుల సురక్షితం

  • న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా మంటలు 
  • సారాయ్ భూపత్ స్టేషన్ వద్ద మంటలు గుర్తించి రైలు ఆపేసిన స్టేషన్ మాస్టర్
  • పలువురు ప్రయాణికులకు గాయాలు
  • రంగంలోకి దిగి మంటలు ఆర్పిన సిబ్బంది
  • కొన్ని గంటల తరువాత గమ్యస్థానానికి బయలుదేరిన రైలు
Massive fire erupts in New Delhi Darbhanga Express train near Etawah

న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ 1 బోగీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మరో రెండు బోగీలకు వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. రైలు సారాయ్ భూపత్ స్టేషన్ మీదుగా వెళుతున్న సమయంలో ఎస్ 1 బోగీలోంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేశారు. ఆ తరువాత సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

అనంతరం, మంటలను ఆర్పాక రైలు గమ్యస్థానం వైపు బయలుదేరింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా, మంటలను గుర్తించిన వెంటనే తాము రైలు కిటికీల్లోంచి దూకి బయటపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపాడు. రైలు మంటలు ఆర్పేందుకు కావాల్సిన సాధనాలేవీ బోగీలో అందుబాటులో లేవని వాపోయాడు.

More Telugu News