ఎవరికి వారే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు... ఇక ఆపేయండి!: కామారెడ్డి సభలో వీహెచ్
- ముందు పార్టీని గెలిపించాలి.. ఆ తర్వాత అధిష్ఠానం నిర్ణయిస్తుందన్న వీహెచ్
- ఇప్పటికైనా ఈ అంశంపై చర్చ ఆపేయాలని సూచన
- రేవంత్ రెడ్డి రెండుచోట్ల గెలిచాక కొడంగల్ను వదిలేయాలన్న వీహెచ్
తాను చివరగా ఓ రిక్వెస్ట్ చేస్తున్నానని, ఎవరికి వారే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారని, ఇందుకు తనకు బాధగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. 1999లో కూడా మీరు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? అని తనను అడిగితే అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పానన్నారు. ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది సోనియా, రాహుల్, వేణుగోపాల్ అన్నారు. ఎవరికి వారే ముఖ్యమంత్రులం అని చెప్పుకుంటే మనలో యూనిటీ లేదని చెబుతారని అప్రమత్తం చేశారు. మొదట ఎన్నికల్లో గెలవండి... ప్రజలు ఓట్లు వేశాక... సోనియా, రాహుల్ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. పని చేసే వారికి, ప్రజల్లో అభిమానం ఉన్న వారికి అవకాశం ఇస్తారన్నారు. ముఖ్యమంత్రి అంశంపై చర్చ ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు.