union minister: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత తప్పకుండా జైలుకు వెళ్తారన్న కేంద్రమంత్రి అశ్వని చౌబే

  • హన్మకొండ హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి
  • గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏఏపీకి రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపణ
  • తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ధీమా
MLC Kavitha will go jail says union minister

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రమంత్రి అశ్వని చౌబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం కుంభకోణం కేసులో కవితను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత... ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారన్నారు. ఈ తొమ్మిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.

More Telugu News