Allu Arjun: 'మంగళవారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

  • పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత నటించిన చిత్రం 'మంగళవారం'
  • అజయ్ భూపతి దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 11న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు 'మంగళవారం'
Allu Arjun will grace Mangalavaaram movie pre release event

పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత, దివ్యా పిళ్లై తదితరులు నటించిన చిత్రం 'మంగళవారం'. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, నవంబరు 11న సాయంత్రం 6 గంటల నుంచి 'మంగళవారం' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. హైదరాబాదులోని జేఆర్ సీ కన్వెన్షన్స్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వేదికగా నిలుస్తోంది. 

'మంగళవారం' చిత్రం నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి, సిరితేజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. 

గత నెలలో విడుదలైన 'మంగళవారం' ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది.

More Telugu News