Prahlad Patel: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు... బైకుపై వెళుతున్న వ్యక్తి మృతి

  • మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
  • ఈసారి అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్
  • ప్రచారం చేసి వస్తుండగా ఘటన
  • రాంగ్ రూట్లో వచ్చిన బైక్... ఢీకొన్న మంత్రి కారు
  • అక్కడికక్కడే మృతి చెందిన బైకర్  
Union minister Prahlad Patel injured in a road accident

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. 

నర్సింగ్ పూర్ కు సమీపంలో అమర్ వాడా ప్రాంతంలో మంత్రి కాన్వాయ్ వెళుతుండగా, ఓ బైకర్ రాంగ్ రూట్లో వచ్చాడు. ఈ క్రమంలో మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు... బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రితో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. బైక్ పై ఉన్న ఓ చిన్నారి తీవ్రగాయాల పాలైంది. 

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రిగా ఉన్న ప్రహ్లాద్ పటేల్ ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్నారు. ఆయన నర్సింగ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొని వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రహ్లాద్ పటేల్  పీఏ స్వల్పంగా గాయపడ్డాడు.

More Telugu News