Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 595 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 181 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లకు తాత్కాలిక విరామం ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంతో 64,959కి ఎగబాకింది. నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 19,412 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.30%), యాక్సిస్ బ్యాంక్ (2.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.88%), బజాజ్ ఫైనాన్స్ (1.88%), టాటా స్టీల్ (1.79%).      
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.65%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.29%), టాటా మోటార్స్ (-0.29%), టైటాన్ (-0.19%).

More Telugu News