Bangladesh: వరల్డ్ కప్ లో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్... టాస్ గెలిచిన బంగ్లాదేశ్

  • వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్ × శ్రీలంక
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లా
  • ఇవాళ ఓడితే శ్రీలంక కూడా టోర్నీ నుంచి అవుట్
Bangladesh won the toss against Sri Lanka

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్తులు... ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది. అయితే, మ్యాచ్ జరిపేందుకే ఐసీసీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

More Telugu News