Sachin Tendulkar: హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించిన సచిన్

  • గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్
  • సచిన్‌తోపాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా హాజరు
  • ఉత్సాహంగా పాల్గొన్న 8 వేలమంది రన్నర్లు
Sachin Tendulkar flagged off Hyderabad Half Marathon

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌’కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. 

ఈ మారథాన్‌లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు. 

More Telugu News