Pakistan: వర్షం వల్ల పాకిస్థాన్ టార్గెట్ ను కుదించిన అంపైర్లు

  • బెంగళూరులో వర్షం
  • న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్
  • 21.3 ఓవర్లలో 1 వికెట్ కు 160 రన్స్ చేసిన పాక్... వర్షం వల్ల నిలిచిన మ్యాచ్
Umpires reduced Pakistan target due to rain

బెంగళూరులో వర్షం కురవడంతో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. 402 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ 21.3 ఓవర్లలో 1 వికెట్ కు 160 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు గంట పాటు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దాంతో అంపైర్లు ఓవర్లను 41కి కుదించారు. పాక్ సాధించాల్సిన లక్ష్యాన్ని 342 పరుగులుగా నిర్దేశించారు. ఆ లెక్కన పాక్ ఇంకా 19.3 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరికాసేపట్లో మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.

More Telugu News