Virat Kohli: ఫ్యాన్స్ పాటకు మైదానంలో పర్‌ఫెక్ట్‌గా స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. వీడియో ఇదిగో!

  • శ్రీలంకతో మ్యాచ్‌లో అభిమానులను అలరించిన కోహ్లీ
  • ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మై నేమ్ ఈజ్ లఖన్’ పాట పాడిన ఫ్యాన్స్
  • ఫ్యాన్స్ పాటకు కాలు కదిపిన కోహ్లీ
Virat Kohli Joins Fun With Perfect Steps Against Sri Lanka

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ, ఫ్యాన్స్‌ను విష్ చేస్తూ, స్టెప్పులేస్తూ చేసే హంగామా అందరినీ హుషారెత్తిస్తుంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ ఓ పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించాడు.

బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మైనేమ్ ఈజ్ లఖన్’ అని గ్యాలరీలోని ఫ్యాన్స్ పాడడం మొదలుపెట్టారు. ఆ పాట కాస్తా విరాట్ చెవిన పడడంతో కాలు కదపకుండా ఉండలేకపోయాడు. ఆ పాటకు పర్‌ఫెక్ట్‌గా రెండు స్టెప్పులు వేసి అలరించాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 88 పరుగుల వద్ద అవుటై సెంచరీ‌తోపాటు సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

More Telugu News