Team India: కోహ్లీ, గిల్ జోడీ అదుర్స్... భారీ స్కోరు దిశగా భారత్

  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × శ్రీలంక
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • 4 పరుగులకే రోహిత్ శర్మ అవుట్
  • అర్ధసెంచరీలతో కదం తొక్కిన కోహ్లీ, గిల్
  • 28 ఓవర్లలో భారత్ స్కోరు 1 వికెట్ కు 172 పరుగులు
Team India sails towards huge total

శ్రీలంకతో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఆరంభంలోనే అవుటైనప్పటికీ, టీమిండియాపై ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు. అందుకు కారణం... విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్ మాన్ గిల్! వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే, శ్రీలంకపై ఎదురుదాడికి దిగారు. 150 పైచిలుకు భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరుకు బాటలు వేశారు. 

ఈ మ్యాచ్ ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక... భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. 28 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 1 వికెట్ నష్టానికి 172 పరుగులు. కోహ్లీ 84, గల్ 75 పరుగులతో ఆడుతున్నారు. తొలి పవర్ ప్లేలో భారత ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్ లను శ్రీలంక ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఆ తర్వాత కోహ్లీ, గిల్ జోడీని అడ్డుకోవడం లంకేయుల వల్ల కాలేదు. చూస్తుండగానే స్కోరు 100, ఆపై 150 దాటిపోయింది.

More Telugu News