ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా?
- సమన్లు వాపస్ తీసుకోవాలంటూ ఈడీకి లెటర్
- రాజకీయ దురుద్దేశంతోనే నోటీసులు పంపారని ఆరోపణ
- ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేయడమే టార్గెట్
- కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆగ్రహం
కాగా, ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడంలేదని సమాచారం. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. విచారణకు డుమ్మా కొట్టి మధ్యప్రదేశ్ కు వెళుతున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు మధ్యప్రదేశ్ లో జరిగే ర్యాలీకి హాజరవుతారని ఆప్ నేతలు చెబుతున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను గతంలో సీబీఐ అధికారులు విచారించారు. అయితే, ఈడీ నోటీసులు పంపడం ఇదే మొదటిసారి.