కృతజ్ఞతా కచేరి మా హృదయాలను ఉప్పొంగించింది: నారా బ్రాహ్మణి
- చంద్రబాబు 52 రోజులపాటు బయట లేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరు ఆశ్చర్యం
- రోజు గడిచే కొద్దీ చంద్రబాబుకు మద్ధతు రెట్టింపు అవుతోందని వ్యాఖ్య
- గచ్చిబౌలి ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై బ్రాహ్మణి ట్వీట్
నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే రాజనీతిజ్ఞుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఎంత ప్రయత్నించినా సత్యం ఏంటో ప్రజలకు తెలుసునని, వాళ్లంతా చంద్రబాబు పక్షాన బలంగా నిలబడతారని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు.
ఇదివుండగా సైబర్టవర్స్ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ జరిగింది. ఈ ఈవెంట్లో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్ హైదరాబాద్లోని పలుప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.