kotha prabhakar reddy: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు: పోలీస్ కమిషనర్ శ్వేత

  • ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై స్పందించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్
  • ఈ దాడి ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు వెల్లడి
  • మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన పోలీస్ కమిషనర్
Police Commissioner Shwetha on attack on Kotha Prabhakar Reddy

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై మిరుదొడ్డి మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల గడ్డం రాజు కత్తితో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఎంపీకి గాయాలయ్యాయని, ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి గజ్వేల్ ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

More Telugu News