: 'బల ప్రదర్శన' చేసిన డీఎల్

అమర్యాదకరరీతిలో బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి బల ప్రదర్శనకు ఉపక్రమించారు. పదవీచ్యుతుణ్ణయినా, ప్రజాదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని యత్నించారు. ఈ క్రమంలో కడప జిల్లా మైదుకూరు వద్ద భారీ బహరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో తన హవా తగ్గలేదని చాటే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డీఎల్ మాట్లాడుతూ, సీఎం కిరణ్ పై నిప్పులు చెరిగారు. కిరణ్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంలా తయారైందని విమర్శించారు. తన పట్ల సీఎం వ్యవహరించిన తీరు ఆయన నిరంకుశత్వానికి తార్కాణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News