విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

  • విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ... ముగ్గురి మృతి
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్
  • వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి సంఘటన స్థలి వద్దకు వీలైనన్ని అంబులెన్స్ లు పంపించాలని స్పష్టం చేశారు. ఘటన స్థలికి సమీపంలోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.


More Telugu News

YS Jagan Train Accident Vijayanagaram District