Komatireddy Venkat Reddy: ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంటుంది: కోమటిరెడ్డి ధీమా

  • నాయకుల కోసం కాకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఉందన్న కోమటిరెడ్డి
  • భువనగిరిలో నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాయాలన్న కాంగ్రెస్ నేత
  • ఎన్నికలకు మరో 33 రోజులు మాత్రమే ఉందని వ్యాఖ్య
Komatireddy Venkat Reddy says congress will win 12 seats in nalgonda

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నాయకుల కోసం కాకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఉందన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ చివరిసారి 1983లో గెలిచింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ... భువనగిరిలో నలభై ఏళ్ల చరిత్ర తిరగరాయాలన్నారు. ఎంత కష్టపడాలన్నా ఎన్నికలకు మరో 33 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తామన్నారు.

ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అయిదేళ్లు మీ కోసం మేమంతా కష్టపడతామన్నారు. తనకున్న 27 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని, కాంగ్రెస్ గెలుపు మీ బాధ్యతే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అనిల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నాడు తెలంగాణ ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశానన్నారు.

More Telugu News