గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి: ఈటల రాజేందర్
- బీజేపీ సభకు ప్రజలు రాకుండా డబ్బులిచ్చి, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఈటల
- హుజూరాబాద్లో ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టినట్లు గజ్వేల్లోనూ అదే జరుగుతుందని వెల్లడి
- ఎన్ని కుట్రలు చేసినా బీజేపీయే గెలుస్తుందన్న బీజేపీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్లో అదే జరుగుతోందన్నారు.