శ్రీలంక కీలక నిర్ణయం.. భారతీయులకు ఉచితంగా వీసాలు!
- పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక చర్యలు
- భారత్ సహా 8 దేశాల ప్రజలకు ఉచిత వీసాల జారీ
- పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే మార్చి 31 వరకూ కార్యక్రమం
ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. అయితే, 2020 నాటి కరోనా సంక్షోభం, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయం వెరసి శ్రీలంకకు విదేశీ పర్యాటకుల రాకడపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం పలు దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.