Medigadda Barrage: మేడిగడ్డ 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమే: ఈఎన్ సీ వెంకటేశ్వర్లు

  • కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్
  • ఓ పిల్లర్ కుంగిపోయిన వైనం... బ్యారేజ్ పై నిలిచిన రాకపోకలు
  • రాజకీయంగా విమర్శలకు తావిచ్చిన ఘటన
  • పిల్లర్ కుంగడం వల్ల బ్యారేజ్ కు ప్రమాదం లేదన్న ఇంజినీర్ ఇన్ చీఫ్
ENC Venkateswarlu clarifies Medigadda incident

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన సంగతి తెలిసిందే. రాకపోకలు సాగించే ఆ బ్యారేజిపై ఓ పిల్లర్ కుంగడం తీవ్ర ఆందోళన కలిగించింది. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనడానికి ఇదే నిదర్శనమని విపక్షాలు అధికార బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోశాయి. 

ఈ నేపథ్యంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు స్పందించారు. మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై నిపుణులతో పర్యవేక్షిస్తామని వెంకటేశ్వర్లు తెలిపారు. కుంగిపోయిన పిల్లర్ ను 45 రోజుల్లో పునర్ నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఐదేళ్ల వరకు ఎల్ అండ్ టీ కంపెనీదే నిర్వహణ బాధ్యత అని వివరించారు.

More Telugu News