Allu Arjun: ప్రిన్సిపాల్ నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకోని ఇద్దరం పోరంబోకులం ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాం: అల్లు అర్జున్

  • 'పుష్ప' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
  • జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్
  • హైదరాబాదులో గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్
  • హాజరైన జాతీయ అవార్డు గ్రహీతలు
Allu Arjuna interesting comments in Mythri Movie Makers grand party

'పుష్ప' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పురస్కారాలు అందుకున్న సంగతి తెలిసిందే. అటు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా జాతీయ అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో, నేషనల్ అవార్డు విన్నర్స్ కు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ  గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికర అంశం వెల్లడించారు. 

"నాతో పాటు దేవి శ్రీ ప్రసాద్ కు కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో మా నాన్న (అల్లు అరవింద్) చాలా సంతోషపడ్డారు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్టు ఉంది అంటూ పొంగిపోయారు. ఎందుకంటే ఇవాళ సత్యమూర్తి (దేవి శ్రీ ప్రసాద్ తండ్రి) గారు లేకపోవచ్చు... దేవి కూడా నా బిడ్డ లాంటివాడే... అతడు అవార్డు అందుకోవడాన్ని నేను చూడాలి అంటూ నాన్న ఢిల్లీ వచ్చారు. నాకు జాతీయ అవార్డు వచ్చినందుకు ఎంత ఆనంద పడ్డారో, అంతే సమానంగా, దేవికి అవార్డు వచ్చినందుకు కూడా ఆనందపడ్డారు. 

అప్పుడు నేను మా నాన్నతో అన్నాను... నాన్నా నీ భాషలో చెప్పాలంటే... చెన్నైలో ఇద్దరు పోరంబోకులు... కనీసం స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద సర్టిఫికెట్లు కూడా తీసుకోని వాళ్లం... ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్ మెడల్ అందుకుంటామని అనుకున్నావా? అని అడిగాను" అంటూ పార్టీకి హాజరైన అందరినీ నవ్వించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News