తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక మంత్రి బోసురాజు, అశోక్ శంకర్రావు

Congress party appoints elections observers for Telangana
  • తెలంగాణలో రాజుకున్న ఎన్నికల వేడి
  • అభ్యర్థుల జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ కసరత్తులు
  • ఈ రాత్రికి లేదా రేపు అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం 
తెలంగాణ ఎన్నికల తేదీ వచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదే అంశంపై సమావేశం నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఈ రాత్రికి లేదా రేపు విడుదల చేయనున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నేటి సమావేశంలో తెలంగాణ ఎన్నికలకు పరిశీలకులను నియమించింది. తెలంగాణ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక మంత్రి బోసురాజు, అశోక్ శంకర్రావులను నియమించింది.
Go Back to Shorts
Congress
Telangana
Elections
Candidates

More Telugu News