Hyderabad: పాలస్తీనాకు హైదరాబాద్‌లోని దర్గాలో మహిళల సంఘీభావం!

  • ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
  • పాలస్తీనాకు అనుకూలంగా సైదాబాద్‌ దర్గాలో కలిసిన మహిళలు
  • దర్గా ద్వారం వద్ద ఇజ్రాయెల్, అమెరికా జెండాలు
Women in Hyderabad gathered at a Dargah ground to demonstrate solidarity with Palestine

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో భారత్‌లో రెండు దేశాలను సమర్థించేవారు కనిపిస్తున్నారు. భారత్‌లో ఎక్కువమంది ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉన్నారు. అయితే కొంతమంది పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ దర్గాలో కొంతమంది ముస్లిం మహిళలు పాలస్తీనాకు సంఘీభావంగా సమావేశమయ్యారు.

ఇందుకు సంబంధించి ఏఎన్ఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో దర్గా ప్రవేశద్వారం వద్ద నేలపై ఇజ్రాయెల్, అమెరికా జెండాలు కనిపించాయి. మహిళలు ఆ జెండాల మీదుగా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు సైదాబాద్ ప్రాంతంలో మహిళలు దర్గా వద్ద సమావేశమయ్యారని ఏఎన్ఐ పేర్కొంది.

More Telugu News