South Central Railway: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. ఆ రూట్లో రైళ్ల రద్దు

  • రేపు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
  • 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య రైళ్లు
  • కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
South Central Railway Announce 9 Special Trains For Dusara

దసరా సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరోమారు గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ కోసం ఇప్పటికే వేసిన ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోతుండడంతో మరో 9 రైళ్లను ప్రకటించింది. రేపు (20న)నాందేడ్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు (07061) నాండేడ్‌లో బయలుదేరి నిజామాబాద్, సికింద్రాబాద్, నల్గొండ మీదుగా కాకినాడకు చేరుకుంటుంది.

24న హైదరాబాద్-కటక్(07165) రైలును ప్రకటించింది. ఇది నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుంది. 25న కటక్-హైదరాబాద్‌(07166) మధ్య మరో రైలు నడుస్తుందని, ఈ రైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రత్యేక రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించవని అధికారులు పేర్కొన్నారు. 

ఈ రైళ్లు రద్దు
మరోవైపు, నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. నేటి నుంచి ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు, మార్గాలు ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

More Telugu News